16-06-2025 01:45:14 AM
- విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తు
- మెరుగైన విద్య కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం
- విక్టోరియా మెమోరియల్ స్కూల్
- ఆధునికరణ కోసం రూ, 5 కోట్లు మంజూరు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- వీఎం హోమ్లో పుట్టినరోజు వేడుకలు
ఎల్బీనగర్, జూన్ 15 : కాంగ్రెస్ ప్రభు త్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు, విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్ గా ప్రభుత్వం భావిస్తుందని, మెరుగైన విద్య కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. ఆదివారం ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలోని విక్టోరియా మె మోరియల్ ఆర్ ఫాన్స్ హోమ్ లో విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వ హించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... విద్య ద్వారా నే మానవ వనరులు మెరుగుపడి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంద న్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యారంగానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సీ ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డా ప్రపంచంతో పోటీపడేలా ఇంటర్నేషనల్ స్టాండర డ్స్ తో విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ, 200 కోట్ల పెట్టుబడితో యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మొద టి దశలో రూ, 11,600 కోట్లతో 100 పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేట లోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. విక్టోరియా మెమోరియల్ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు వెంటనే రూ, 5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాన్స్ కో శాఖలోని CSR ఫండ్స్ నుంచి ఈ కేటాయింపులు చేస్తున్నట్టు చెప్పారు.
నిధులు వెంటనే విడుదల చేస్తామని, వెంటనే ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విక్టోరియా మెమోరియల్లో చదువుకుంటున్న అనాథ విద్యార్థులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌ డ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్ రెడ్డి రామ్ రెడ్డి, లింగో జిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి, కందికంటి శ్రీధర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రోహిత్, నరేందర్, శ్రీనాథ్, వెంకట్ తదితరులుపాల్గొన్నారు.