02-06-2025 01:01:00 AM
సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ
చండూరు, జూన్ 1 : ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందుతారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు.ఆదివారం చండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ 8 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మొక్కలను 2021- 2022 సంవత్సరంలో నాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొదటి కోత లోనే సుమారు మూడు టన్నుల దిగుబడి మొదటి కోతలోనే వచ్చిందన్నారు.
ఉద్యాన శాఖ వారి సలహాలు, సూచనలు మేరకు మేలైన యజమాన్యపద్ధతులు డ్రిప్ ద్వారా నీటి యజమాన్యం పాటించి, సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా మంచి దిగుబడులు వచ్చాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీటి వసతి కలిగిన రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లయితే మంచి లాభాలు పొందడం పాటు ఎటువంటి నష్టం జరిగే ప్రమాదం లేదని వారు తెలిపారు.
నల్లగొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి మాట్లాడుతూ, నీటి వసతి కలిగిన రైతులు అందరూ కూడా ఆయిల్ పాము సాగు చేసినట్లయితే మంచి లాభాలు పొందుతారని ఆయన అన్నారు. ఎటువంటి మార్కెటింగ్ సమస్య ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని, ప్రతి నెల పంట దిగుబడి ని ప్రభుత్వ ఉద్యోగి వలె నెలసరి ఆదాయం, దాదాపు 30 సంవత్సరాలు పొందవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి రావుల విద్యాసాగర్, పతాంజలి కంపెనీ ఫీల్ ఆఫీసర్ శ్రీను, పతాంజలి కంపెనీ చండూరు ఫీల్ ఆఫీసర్ మోహన్, రైతులు శ్రీను, శంకరమ్మ, లింగస్వామి గ్రామ రైతులు పాల్గొన్నారు.