02-06-2025 12:58:49 AM
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్
సూర్యాపేట, జూన్ 1 (విజయక్రాంతి) : యాదవులకు చట్టసభల్లో ప్రభుత్వం 16 శాతం వాటా కల్పించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తగుళ్ళ జనార్దన్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోనీ 60 ఫీట్ల రోడ్డు మహర్షి డిగ్రీ కళాశాలలో ఆదివారం సంఘ సమావేశం ఏర్పాటు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో యాదవులు అధిక శాతం ఉంటూ, పంటలు పండిస్తూ, జంతువులను సాదుతూ, ఈ దేశానికి అన్నం పెడుతున్న యాదవులకు చట్టసభలలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే యాదవులకు ఒక మంత్రి పదవి ఇచ్చి, రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా యాదవులకు అవకాశం కల్పించాలన్నారు.
తదుపరి సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జటంగి వెంకట నరసయ్య యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న యాదవ్, ఉపాధ్యక్షులు కోడి సత్యనారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆరాల రమేష్ యాదవ్, కార్యదర్శి కమ్మాల లింగయ్య యాదవ్, కోశాధికారి దూబాని మల్లేష్, సలహాదారులు మన్నే యాదగిరి యాదవ్, కోడి శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.