30-10-2025 01:28:23 AM
ములుగు, అక్టోబరు29(విజయక్రాంతి):మోంథా తుఫాను కారణంగా ములుగు జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకునేడు గురువారం రోజున సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని మండల విద్యాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ అత్యవసర సమాచారాన్ని తమ పరిధిలోని పాఠశాలలకు, విద్యార్థులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.