22-06-2025 05:42:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన టీజీ ఆర్టీసీ(TGSRTC) డ్రైవర్ ఆదివారం తన నిజాయితీని చాటుకున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి నిర్మల్ కు వస్తుండగా ఓ ప్రయాణికుడు 70 వేల విలువచేసే ఐఫోన్ను బస్సులో మరిచి వెళ్లిపోయారు. నిర్మల్ బస్టాండ్ లో ప్రయాణికులు దిగిపోగా డ్రైవర్ బస్సును డిపోలోకి తీసుకెళ్తుండగా సోల్ ఫోన్ కనిపించింది, డిపోలో డ్రైవర్ బస్ అప్పగించేటప్పుడు ఫోన్ కనబడింది.
దీంతో డ్రైవర్ హనుమంతు ఆ ఫోను ఆర్టీసీ అధికారులకు అప్పగించి పోగొట్టుకున్న బాధితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఇవ్వడం జరిగిందని నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. నిజాయితీగా ఫోను తనకు అప్పగించిన డ్రైవర్ను ఆర్టీసీ సిబ్బందిని బాధితుడు వంశీ ప్రత్యేకంగా అభినందించారు. నిజాయితీ చాటుకొన్న హన్మంత్ డ్రైవర్ను డిపోమేనేజర్ కే పండరి మరియు పలువురు ప్రశంసించారు.