01-06-2025 01:09:41 AM
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఎన్ని రాఫెల్ ఎయిర్ క్రా ఫ్ట్స్ కూలిపోయాయని ప్రశ్నించగా.. విదేశాంగశాఖ ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్తో భారత్ ఘన విజయం సాధించిం దని ఇందులో వాయుసేన సిబ్బంది పనితీరు అద్భుతమని వారికి అభినందనలు తెలిపారు.
పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాలపై కచ్చితమైన దాడులు జరిగాయన్నారు. ఇదంతా భారత వైమానికశక్తికి నిదర్శనమని తెలిపారు. యుద్ధంలో రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయిందా అని అడిగినందుకు కాంగ్రెస్ నేతలను దేశద్రోహులంటూ విమర్శించడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడీఎస్ అనిల్ చౌహాన్ రాఫెల్ కూలిపోయింది నిజమేనని వెల్లడించారని.. ఇప్పుడు ఆయన కూడా దేశద్రో హేనా.. అని ప్రశ్నించారు.
ఫైటర్ విమానాలు, ఆయుధాలను అందించడంలో ఆలస్యం అవుతోందని ఎయిర్చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇదే విషయమై రాహుల్గాంధీ, తాను పార్లమెంట్లో మాట్లాడామని అన్నారు. సకాలంలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ చేయడంలో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వైఫల్యం చెందిందని ఆరోపించారు.
తేలికపాటి యుద్ధ విమానాలను సప్లు చేయడంలో హెచ్ఏఎల్ ఆలస్యం చేస్తోంద ని..అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. ఆపరేషన్, ఆర్అండ్డీ విభాగాల్లోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని..ఈ విషయంలో కేంద్రప్రభుత్వం పారదర్శకత పాటించాలని మంత్రి కోరారు.