01-06-2025 01:11:21 AM
--చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేశ్కుమార్
ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఉద్యోగరీత్యా పదవీ విరమణ అనేది సహజమని చిక్కడపల్లి ఏసీబీ ఎల్ రమేశ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించిన బాలకృష్ణన్ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది.
సందర్భంగా ఏసీపీ రమేశ్కుమార్ మాట్లాడుతూ.. బాలకృష్ణన్ పోలీసు శాఖలో గత 36 సంవత్సరాలుగా అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాలకృష్ణన్తోపాటు ఆయన కుటుం బ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బీ రాజునాయక్, ఎసైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.