calender_icon.png 8 October, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

08-10-2025 06:52:12 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలో తుర్కపల్లి మండలానికి చెందిన దయ్యంబండ తండా, మంచిరోని మామిళ్ల, బబ్లు తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గొంగిడి మహేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం మీద ప్రేమతో ఇంకా మరింత మంది వస్తారని తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.