calender_icon.png 7 June, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆయువు పట్టు

06-06-2025 01:08:00 AM

సిద్దిపేట, జూన్ 05 (విజయక్రాంతి):: పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆయువు పట్టు అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వంద రోజులు, 50 కార్యక్రమాలు అనే బృహత్ ప్రణాళికలో భాగంగా సిబ్బందితో కలిసి మొక్కలు నాటి, ట్రీ గార్డులను ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు, మానవాళి, జీవకోటి మునగడకు మొక్కలే జీవనాధారం అని గుర్తు చేశారు. పురపాలికలో బృహతు ప్రణాళిక అమలులో భాగంగా త్వరలో వనమహోత్సవం పేరుతో దాదాపు 30 వేల మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 

అనంతరం నూతన పురపాలిక కమిషనర్ రమేష్ కుమార్ ను మెప్మా ఆర్పీలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలిక ఏ ఈ శ్రీకాంత్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, మెప్మా సిఓ సరిత, వర్క్ ఇన్స్పెక్టర్ బుస ప్రవీణ్, మెప్మా ఆర్పీలు, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.