17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భార్య కాపురానికి రావడం లేదని గొంతు కోసుకున్న భర్త

31-01-2026 05:03 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడంలేదని భర్త గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏమాయకుంట పంచాయతీ పరిధిలోని సుందర్ నగర్ లో నివాసం ఉండే రాందాస్ (40) శనివారం గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతు కోసుకున్న సమయంలో ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకుని,  108 అంబులెస్ కు సమాచారం అందించారు. వెంటనే 108 ఈఎంటీ కృష్ణ, పైలెట్ రాజేష్ వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని ఎస్సై సాయన్న తెలిపారు.