02-09-2025 12:00:00 AM
-ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ
పాట్నా, సెప్టెంబర్ 1: ‘ఓట్ చోరీపై ఇటీవల తాము అణుబాంబు పేల్చామని, తర్వ లో మరో శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ అధికార్ యాత్రలో భాగంగా చివరి రోజు సోమవారం బీహార్ రాజధాని పాట్నాలో ని ర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను చో రీ చేసే గెలవాలని భావిస్తున్నదని, ఆ పార్టీ ఆటలను సాగనివ్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.