02-09-2025 12:00:00 AM
వాషింగ్టన్, సెప్టెంబర్ 1: అవకాశం దొరికినా, దొరక్కపోయినా.. అవకాశాన్ని కల్పిం చుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో భారత్పై విషం కక్కుతూనే ఉన్నారు. నోటికొచ్చినన్ని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా.. ‘రష్యాకు భారత్ చాకిరేవులా పనిచేస్తున్నది.
ఓ వర్గానికి మేలు చేసేందుకు భారత ప్రజల భవిష్యత్తును ఫణంగా పెడుతున్నది. దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చర్యలు ఉక్రెయిన్వాసులకూ ముప్పు’ అని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నవారో చైనా, రష్యాతో భారత్ సంబంధాలు నెరపడం యావత్ ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని ప్రేలాపన చేసి అభాసుపాలైన సంగతి విదితమే.