15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కథ విని షాకింగ్‌లో ఉండిపోయా

10-12-2025 01:38 AM

వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ‘నయనం’తో అలరించనున్నారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. ఇందులో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్న నేథ్యంలో  ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “నెరేషన్ వినగానే షాకింగ్‌లో ఉండిపోయా.

నయన్ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయిపోయా. చాలా రోజుల తర్వాత మంచి ప్రాజెక్టు చేశాననే సంతృప్తితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా” అన్నారు. ‘ఈ ప్రాజెక్ట్ నాకెంతో స్పెషల్. ఇందులో మాధవిగా కనిపించబోతున్నాన’ని ప్రియాంక జైన్ తెలిపారు. వితికాశేరు మాట్లాడుతూ “తెలుగులో అరుదుగా వచ్చే ప్రాజెక్ట్ ఇది” అని చెప్పారు.

డైరెక్టర్ స్వాతి ప్రకాశ్ మాట్లాడుతూ “పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారి లైఫ్ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సిరీస్‌” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రజినీ తాళ్లూరి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, జీ5 టీమ్, చిత్రబృందం పాల్గొన్నారు.