15 June, 2026 | 10:16 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు!

09-12-2025 01:18 AM

హీరోలు, హీరోయిన్లు అప్పుడప్పు డు తమ ప్రేమకథలను బయట పెడుతుంటారు. తాజాగా అందాల భామ రాశి సింగ్ కూడా తన లవ్‌స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ఆహా ఓటీటీలో ‘3 రోజెస్’ సిరీస్ సీజన్2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాశి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు నడిపిన ప్రేమాయణం గురించి  తెలిపింది.

“నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించా. అతను నా బాయ్‌ఫ్రెండ్. అందుకే కాలేజీలో నాకు చాలా ఫేవర్‌గా ఉండేవాడు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాకు క్వశ్చన్ పేపర్స్ తెచ్చిచ్చేవాడు. వైవాలో ఏమీ అడిగేవాడు కాదు. వైవా జరిగినప్పుడు మేమిద్దరం ఓ పది నిముషాలు అలా సరదా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవా ళ్లం.

అప్పుడు నా ఏజ్ 17. అప్పటికి అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పటికీ సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్నాడు. వాళ్ల భార్య కూడా ఫాలో అవుతుందనుకుంటా. అయితే, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు” అని తెలిపింది.