సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : భారత వైమానిక దళానికి చెందిన మానవ రహిత విమానం రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో గురువారం కుప్పకూలింది. రిమోట్ ఆధారితమైన ఈ విమానానికి సాధారణ పరీక్షలో భాగంగా టెస్ట్ రన్ నిర్వహించగా, సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం చోటుచేసుకుందని ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు. పోలీసులు, వైమానిక దళ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. విమానం కూలిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.