calender_icon.png 15 June, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు

14-06-2025 12:00:00 AM

జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బి పాపిరెడ్డి 

మహబూబ్ నగర్ జూన్ 13 (విజయ క్రాంతి) : ఇరువురు వివిధ కేసుల్లో ఇరుక్కొని కొట్లాడుకుంటే ఒక్కరే గెలుస్తారని.... రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బి పాపిరెడ్డి అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 14న శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులకు సంబంధించిన కక్షిదారులు లోక్ అదాలత్ లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.