24-10-2025 01:09:39 AM
నాగిరెడ్డి అద్దాల మంటపంలో ఆశీర్వాదం అందజేత
వేములవాడ టౌన్, అక్టోబర్ 23 (విజయ క్రాంతి):వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా మి ఆలయంలో ఇన్చార్జి కలెక్టర్ గరిమా అ గ్రవాల్ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అ నంతరం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లగా, ఆలయ అర్చకులు స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఇన్చార్జి కలెక్టర్ దంపతులకు ఆలయ ఏఈవో బ్రహ్మన్న శ్రీనివాస్ స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు.కార్యక్రమంలో తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు ఆలయ అధికారులు తదితరులుఉన్నారు.