14 April, 2026 | 1:27 PM

పేదల సొంతింటి కల సాకారం అవుతున్న వేళా

05-12-2025 11:56 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నగరంలోని వీరన్న పేట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి,  లబ్దిదారు హన్నీస ఉన్నీస్ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పేదల సొంతింటి కల ను సాకారం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, నాయకులు సయ్యద్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.