27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర

06-12-2025 12:21 AM
  1.   66 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది 
  2. గ్లోబల్ సమ్మిట్‌లో విజన్‌ను రూపొందించాలి 
  3. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ర్ట ఆర్థిక లక్ష్య సాధనలో వ్యవసాయ రంగం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ర్ట జీఎస్‌వీఏలో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, అందువల్ల తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందన్నారు.

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుపై శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయరంగం అభివృద్ధి సామర్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబింబించేలా ఏవీలను రూపొందించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2025 ప్రధాన లక్ష్యం.. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమేనని తెలిపారు.

ప్రస్తుతం రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెరిగి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహాదృక్పథానికి ఈ గ్లోబల్ సమిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు  ఇవన్నీ 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలని మంత్రి తుమ్మల అధికారులకు వివరించారు.

‘వ్యవసాయ రంగం బలపడితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు శ్రమే రాష్ర్ట అభివృద్ధికి మూలం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మహా లక్ష్యంలో, వ్యవసాయం అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. ’అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.