20-06-2025 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 1౯ (విజయక్రాంతి): శరణార్థులకు ఐక్యరాజ్యసమి తి శరణార్థి సంఘం యూఎన్ఏసీఆర్ కోడ్ బదులు ఇండియన్ నేషనాలిటీతో జీహెచ్ ఎంసీలో సర్టిఫికెట్లు జారీకావడం వల్ల వారు ఆధార్ కార్డులు, పాస్పోర్టులు పొంది భారతపౌరులుగా చలామణి అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా రోహింగ్యాలు లేదా ఇతర విదేశీయులకు జనన ధ్రువపత్రా లు జారీ చేసేటప్పుడు యునైటెడ్ నేషన్ (యూఎన్) ఎక్స్సీఆర్ లే దా యూఎన్ఏ సీఆర్ అని జారీ చేయాలి. కానీ, జీహెచ్ఎంసీ అధికారులు ఆసుపత్రుల నుంచి వచ్చిన ధ్రువప త్రాలకు అప్రూవల్ ఇస్తున్నప్పుడు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోహింగ్యాలకు భారతీయ నేషనాలిటీతో సర్టిఫికెట్లు జారీ అయ్యాయి.
ఈ అంశంపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. కేంద్రం ఆదేశాలతో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు జీహెచ్ఎంసీని అలెర్ట్ చేశారు. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంట ర్లు, ప్రధాన ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులైన పేట్ల బురుజు, నిలోఫర్, కోఠి, జిల్లా ఆసుపత్రుల్లో జరిగే జననాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించా రు.
ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఇదే అంశంపై నిలదీశారు. రోహింగ్యాలు ఇక్కడ నకిలీ బర్త్ సర్టిఫికెట్లను పొంది ఆధార్ కార్డులను, పాస్పో ర్టులను తీసుకొని భారత పౌరులుగా మారుతున్నారని ఆరోపించారు. అధికారులు గు ర్తించిన వివరాల ప్రకారం.. 2021--22లో ఆర్డీవో ప్రోసీడింగ్స్ లేకుండా 22,984 సర్టిఫికెట్లు అప్లోడైనట్టు గుర్తించారు.
వీటిని 2023లో రద్దు చేశారు. బార్కాస్ ఏరియా హాస్పిటల్లో ఒక్కచోటే దాదాపు 30 వరకు బర్త్ సర్టిఫికెట్లు రోహింగ్యాలకు జారీ చేసినట్టు గుర్తించారు. రోనాల్డ్రోస్ కమిషనర్గా ఉన్న సమయంలో ఫలక్నుమా సర్కిల్లో 60 వరకు అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించి, ఓ సీనియర్ అసిస్టెంట్ను జైలుకు పంపారు. ఆ 60 సర్టిఫికెట్లను ఇప్పటివరకు రికవరీ చేయలేదు. మలక్పేట్, ఫలక్నుమా సర్కిళ్ల పరిధిలో అనేక మంది స్థానికేతరులకు జనన ధ్రువపత్రాలు జారీ అయినట్టు గుర్తించారు.
టోలిచౌకి పరిధిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 65 జనన ధ్రువపత్రాలు, 8 మరణ ధృవపత్రాలు అక్రమంగా జారీ అయినట్టు గుర్తించినా, వాటిని కూడా రికవరీ చేయడం లేదు. జారీ అయిన జనన, మరణ ధృవపత్రాలు ఎక్కడెక్కడ ఉపయోగించారనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. రోహింగ్యాలు, ఇతర దేశస్తులకు సంబంధించి ఇప్పటివరకు జారీ అయిన సర్టిఫికెట్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ విభాగం జీహెఎంసీని ఆదేశించింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.