calender_icon.png 7 July, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు..

06-07-2025 10:53:14 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనేది ప్రజా ప్రభుత్వ సంకల్పం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. ఆదివారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52 వ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీ (రాం నగర్) ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ (ముగ్గు పోసి) చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లు మంజూరు చేయగా ఇంకా అర్హులు ఉంటే మరిన్ని ఇళ్లను తీసుకువస్తానని తెలిపారు. అర్హుల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని కోరారు.

పూర్తి స్థాయి పట్టణ ప్రాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాప్యంగా ఉందని అధికారులు మరింత వేగవంతం చేయాలని కోరారు. అర్హత ఉండి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దళారులని నమ్మవద్దని సూచించారు. పసలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వం చేస్తున్న పనులకు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని విద్యారంగంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నూతన విద్యావిధానం అమల్లోకి తీసుకురావాలని 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేస్తే వ్యతిరేకిస్తున్న నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారని కోరారు. దశాబ్ద కాలంగా అభివృద్ధి నోచుకొని నియోజవకర్గంలో ఒక్కొక్కటిగా అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

వేయి స్తంభాల దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు..

ఆదివారం రోజు పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమారెడ్డి తో కలిసి ప్రసిద్ధి వెయ్యి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సంపదతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఏకాదశి పర్వదినాన్ని విశిష్టంగా జరుపుకోవాలని కోరుకున్నారు. అంతకుముందు ఆలయ ప్రధానార్చకులు నాయని దంపతులను పూర్ణకుంభం, వేదమంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆలయ వారధులు సాలువాతో సత్కరించారు. అనంతరం నాయిని దంపతులు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రసాద విచారణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సహస్థాలతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, నాయకులు సుగుణాకర్ రెడ్డి, బాలు నాయక్, రాములు, దేవేందర్ రెడ్డి, మోహన్ నాయక్, వీరు, సాయి, కాలనీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.