17 July, 2026 | 2:38 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

16-07-2025 12:00 AM

జగిత్యాల అర్బన్, జూలై 15(విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గొల్లపల్లి మండలం గుంజపడుగు, పెగడపల్లి మండలం నంచర్ల గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. ఇల్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను కలిసి ప్రభుత్వం అందించే తోడ్పాటు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి నిర్మాణం పనుల్లో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, హౌసింగ్ డి ఈ. భాస్కర్.ఎంపీడీవో లు, తహసిల్దార్లు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ సంబంధిత అధికారులుపాల్గొన్నారు.