calender_icon.png 28 June, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

28-06-2025 12:00:13 AM

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ 

మహబూబాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి): రాష్ట్రంలో నిలువ నీడలేని ప్రతి పేద కుటుంబానికి నిలువ నీడ కల్పించడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని, దశలవారీగా అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇప్పటివరకు ప్రొసీడింగ్స్ ఇచ్చిన లబ్ధిదారులు ఇండ్లు కట్టుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ , డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.

డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని రాజోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం సూచించిన విధంగా ఇల్లు నిర్మాణం చేపట్టాలని, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయకూడదని ఆదేశించారు.

అలాగే కురవి మండలం కొత్తూరు ( సి) గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల విద్యాభివృద్ధికి దాతల చేయూత అవసరమని, ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.