calender_icon.png 12 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామంతాపూర్‌లో అమానవీయ ఘటన

12-07-2025 10:17:52 AM

హైదరాబాద్: రామంతాపూర్‌(Ramanthapur) పరిధిలోని వివేక్ నగర్‌లో శనివారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూసీ కాలువ పక్కన నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు మగశిశువును వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. శిశువును గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును ఎవరు వదిలిపెట్టారన్న కోణంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు  చేస్తున్నారు.