12-07-2025 03:26:05 PM
నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల పరిధిలోని మిరియాల గ్రామానికి చెందిన ఇరుగు ఉప్పలమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మృతిని కుటుంబాన్ని శనివారం జై భీమ యూత్ సభ్యులు పరామర్శించి ఆ కుటుంబానికి ఒక కింటా బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిరుపేదలు ఎవరైనా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు తమ వంతు సాయం అందింస్తామని వారు తెలిపారు.