17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడగింపు

08-05-2025 12:20 AM

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. బుధవారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయి ఒక ప్రకటనను విడుదల చేశారు. రూ.వేయి అపరాధ రుసుముతో ఈనెల 8వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

బుధవారంతో గడువు ముగియడంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఒక రోజు గడువును పొడిగించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.