calender_icon.png 19 August, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ ఆసుపత్రి నుంచి ఖైదీ పరారీ

19-08-2025 11:30:22 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం ఖైదీ సోహైల్ ను గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా, ఆసుపత్రిలోని వాష్ రూమ్ వెంటిలేటర్ నుంచి దూకి తప్పించుకున్నాడు. ఖైదీ సోహైల్ బేగంపేటలో ఓ దోపిడి కేసులో అరెస్టయ్యాడు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించే ముందు బేగంపేట పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా, ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైదీ సోహైల్ పలు కేసుల్లోనూ నిందితునిగా ఉన్నాడు. పారిపోయిన సోహైల్ పై చిలకలగూడ పోలీసులు(Chilakalguda Police) కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.