calender_icon.png 30 May, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో ఇంటర్ విద్య బంద్..

28-05-2025 11:47:06 PM

కార్యక్రమంలో సీఎం రాజకీయాలు మాట్లాడారు..

బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్..

హైదరాబాద్ (విజయక్రాంతి): గురుకులాల్లో ఇంటర్ విద్యను మూసివేసే ప్రయత్నం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేస్తున్నారని బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్(BRSV President Gellu Srinivas Yadav) ఆరోపించారు. కార్పొరేట్ కాలేజీల కోసం గురుకుల కాలేజీలను మూసివేస్తున్నారని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పటిలోగా కడతారో రేవంత్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.

బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గురుకుల స్కూల్స్ భవనాల యజమానులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక గురుకులాల్లో జాయిన్ కావాలంటే విద్యార్థులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల అడ్మిషన్లు పడిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి చేస్తామన్నారు.