29-05-2025 12:00:00 AM
- సముద్రం పాలయ్యే నీటినే ఏపీ వాడుతున్నది..
- ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
- కడపలో రెండోరోజూ సాగిన ‘మహానాడు’
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): సముద్రం పాలయ్యే నీటిని నిల్వచేసేందుకే ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నదని, తద్వారా తెలంగాణకు ఎలాం టి నష్టం వాటిల్లదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్తో రాయలసీమకు నీరం దిస్తామని వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లని ఉద్ఘాటించారు. ప్రాజె క్ట్తో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ నేతలు లేనిపోని ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ నిలిచే ఉంటుందని ఆకాంక్షించారు.
కడప నగరంలో బుధవారం రెండో రోజు నిర్వహించిన ‘మహానాడు’లో పార్టీ శ్రేణుల ను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకొం టున్నామని అన్నారు.
కార్యకర్తల త్యాగాలతోనే పార్టీ నిలబడిందని, కార్యకర్తలే పార్టీ బలం, బలగం అని కొనియాడారు. వారు తన పై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని వ్యాఖ్యానించారు. రానున్న నాలుగు దశాబ్దాలకు తాము పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని, టీడీపీ ఖ్యాతి విశ్వవ్యాపితం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ పాలనలో ఏపీ లో ఫ్యాక్షనిజం, రౌడీయిజం అంతమైందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహిత ప్రాంతంగా మార్చామని వెల్లడించారు. ము న్ముందు తమ పాలనలో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, అందుకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ఆగస్టు ౧౫ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ అధికారంలో ఉంటే 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి, జాతికి అంకితమిస్తానని ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్ట్పైనా తమ దృష్టి ఉందని, ఆ ప్రాజెక్ట్తో మిగతా ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తామని వివరించా రు.
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చే విధంగా కార్యాచరణ అమ లు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో ఎవరూ శాంతిభద్రతలను చేతిలోకి తీసుకోవద్దని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీలోకి ఎవరైనా కోవర్టులు రావాలనుకుంటే ‘ఖబడ్దార్’ అని హెచ్చరించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం
రెండోరోజు జరిగిన ‘మహానాడు’లో తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 1995లో తొలిసారిగా చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. మూడు దశాబ్దాలుగా చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు. ఈమేరకు చంద్ర బాబునాయుడు పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జి వర్ల రామయ్య నుంచి నియామక పత్రం అందుకున్నారు.