21-06-2025 09:22:06 PM
ఘట్ కేసర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయం(Anurag University) ఎన్.ఎస్.ఎస్ సెల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనురాగ్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ పి. భాస్కర రెడ్డి, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ విజయకుమార్, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ మహిపతి శ్రీనివాస్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేష పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ పి. భాస్కర రెడ్డి యోగా యొక్క విలువలను, మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు యోగ, మెడిటేషన్ క్లబ్ ని ఆవిష్కరించారు.
ఎస్.కె. షహీదా యోగాసన ప్రదర్శనలిస్తూ విద్యార్థుల చే అద్భుతమైన యోగాసనాలను వేయించారు. మరియు ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ప్రశాంతతను పొందవచ్చని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పారు. ఈ కార్యక్రమంను వివిధ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్, ఎన్.సి.సి సభ్యులు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీయర్లు విజయవంతంగా నిర్వహించినందుకు గాను అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ అర్చన మంత్రి అందరిని అభినందించారు.