calender_icon.png 22 June, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కుట్టుమిషన్లు పంపిణీ

21-06-2025 09:51:58 PM

ఘట్ కేసర్: ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కుట్టుమిషన్లను పంపిణీ చేస్తుందని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్(Former Municipal Chairman Mulli Pavani Jangaiah Yadav) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇందిరమ్మ మహిళా పథకం కింద మేడ్చల్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల మహిళలకు 200 ఉచిత కుట్టు మిషన్లు మంజూరు అయిన సందర్భంగా నాగారంలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘట్ కేసర్ మున్సిపల్ ప్రాంత ముస్లిం మహిళలకు 21 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజిబ్ బుద్దీన్ తో కలిసి పాల్గొన్న ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కుట్టు మిషన్లతో పేద మరియు ఒంటరి మహిళలకు స్వయం ఉపాధిగా ఎంతో ఉపయోగపడుతూ తమ కష్టంతో జీవనం సాగించొచ్చని పేర్కొన్నారు. 

ఇంతటి అద్భుతమైన ఆలోచనతో కుట్టుమిషన్ లు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. ఈయెుక్క పథకం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు దీని ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్, పోచారం మున్సిపల్స్  కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, కీసరగుట్ట ఆలయ ధర్మకర్తల అమర్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నాగరాజు, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకటనారాయణ, వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవ్ రెడ్డి, యూత్ వైస్ ప్రసిడెంట్ రఫిక్, మైనార్టీ  సీనియర్ నాయకులు ఖయ్యూం, నాయకులు రఫీ, రెహ్మాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.