12-06-2025 01:47:24 AM
సూర్యాపేట, జూన్ 11 (విజయక్రాంతి) : అటవీ హక్కుల ద్వారా పట్టా పొందిన గిరిజన లబ్దిదారులకు సోలార్ ప్లాంట్స్ తో సాగునీరు అందించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా సౌర గిరిజల వికాసం పథకమును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్ ఆధ్వర్యములో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సంబందిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి పథకాన్ని సత్వరమే అమలు కొరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. జిల్లాలో మటంపల్లి, పాలకీడు, చింతలపాలెం మండలాలలో అటవీ భూములు పొందిన గిరిజన రైతులు ఉన్నారని సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహనపరిచి ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమములో జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ కుమార్, జిల్లా భూ గర్భ జల శాఖ అధికారి బాలు నాయక్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా హార్టికల్చర్ & సెరికాల్చర్ శాఖ అధికారి నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మటంపల్లి, పాలకీడు, చింతలపాలెం మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.