01-07-2025 12:00:00 AM
పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై అమానుష అత్యాచార సంఘటన మరువక ముందే తాజాగా దేశం లో మరో ఘటన వెలుగు చూడటం దారుణం. దక్షిణ కలకత్తాలోని కస్బా ప్రాంతంలోని లా కాలేజీకి చెందిన విద్యార్థినిపై అదే కళాశాల ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరిగిన దుర్ఘటన సమాజంలో పేరుకుపోయిన దుర్మార్గపు పరిస్థితులను వెల్లడిస్తున్నది. నేరస్థులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడితే తప్ప ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ఉంటాయి.
రాఘవేందర్, వరంగల్