calender_icon.png 30 May, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదు

07-05-2024 12:05:00 AM

రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా కౌంటర్

ఢిల్లీ, మే 6 (విజయక్రాంతి) : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను భారత్‌లో విలీనం చేస్తామంటూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. పీవోకే విషయంలో పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదని, ఆ దేశం దగ్గర అణు బాంబులు ఉన్నాయని హెచ్చరించారు. పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి? అని ప్రశ్నించారు.

ఒకవేళ, కేంద్ర మంత్రి చెబుతున్నట్లుగానే చేయాలనుకుంటే అలాగే ముందుకు వెళ్లాలని సూచించారు. కాగా, భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఫరూక్ అబ్దుల్లా ఇలా స్పందించారు. మోదీ హయాంలో కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్దిని చూసి భారత్‌లో తాము భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజలు తమంతట తాము భారత్‌లో భాగం కావాలనుకుంటున్నారు కాబట్టి పీవోకేను బలవంతంగా భారత్‌లో కల పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.