5 May, 2026 | 7:22 AM

హౌతీ రెబల్స్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు

08-07-2025 12:00 AM

రెండేళ్ల క్రితం హైజాకైన  నౌక గెలాక్సీ లీడర్ నౌక ధ్వంసం

న్యూఢిలీ, జూలై 7 (విజయక్రాంతి): హౌ తీ రెబల్స్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారం దాడులు చేసింది. రెండేళ్ల క్రితం హైజాక్‌కు గురైన గెలాక్సీ లీడర్ నౌకను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇరాన్‌తో కాల్పుల విరమ ణ ఒప్పందం కుదిరిన అనంతరం తొలిసారి ఇజ్రాయెల్ దళాలు యెమన్‌లోని హుతీ రెబల్స్ స్థావరాలపై వైమానిక దాడులు చేశా యి. ఈ నౌకను 2023లో హౌతీలు హైజాక్ చేసి యెమెన్ పోర్టులో ఉంచారు.

దీనిలో 25 మంది బందీలను కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఈ నౌక ఇజ్రాయెల్‌కు చెం ది ందిగా సదరు రెబల్స్ భావిస్తున్నారు. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన మొత్తం నౌ కలను లక్ష్యంగా చేసుకొంటామని హుతీ లు హెచ్చరించారు. గెలాక్సీ లీడర్ నైక హైజాక్ ను ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలపై సాధిం చిన విజయంగా చెప్పుకోవడం జరిగింది.