26-05-2025 01:34:54 AM
- సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్
- ఓయూలో సీఎస్ఆర్ గదుల ప్రారంభం
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యారంగా న్ని ఆధునీకరించాలన్న రాష్ట్ర ప్రభు త్వం లక్ష్యానికి, విద్యాభివృద్దికి సింగరేణి సంస్థ తమ వంతు సహకారం ఎప్పడు అందిస్తుంటుందని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ తెలి పారు.
వందేళ్ల చరిత్రతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో తరగతి నిర్మాణానికి సింగరేణి సహకరించడం సంస్థకు గర్వకారణమన్నారు. ఆదివారం ఓయూ క్యాంపస్లో డిపార్ట్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ శాఖలో దాదాపు రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన తరగతి గదులను ఓ యూ వీసీ కుమార్తో కలిపి సీ ఎండీ బలరామ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించడానికి సిం గరేణి పూర్తి సహకారమందిస్తుందన్నారు. 13 దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి తలమానికమని ఓయూ వీసీ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్రెడ్డి, ఓఆర్డీ జితేందర్ కు మార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితురులు పాల్గొన్నారు.