15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ తోడ్పాటు

06-01-2026 12:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జనవరి5 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ అన్నారు. మధురానగర్ లోని తెలంగాణ మహిళా సహకార సంస్థ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జై భవాని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్‌ను రాష్ట్ర మహి ళా కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.