02-05-2025 12:00:00 AM
రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్ లైన్ బుక్స్ వెబ్ సైట్ ప్రారంభం
ఎల్బీనగర్,మే 1 : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాగానే జాబ్ క్యాలెండర్ పరుగులు పెడుతుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. గురువారం దిల్ షుఖ్ నగర్ లోని రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్ లైన్ బుక్స్ వెబ్ సైట్ ను రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ... ఉద్యోగాల కల్పన అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు అని, భవిష్యత్తు నిర్మాణంగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ, చిన్నచిన్న టెక్నికల్ ఇష్యూలను దాటి జాబ్ క్యాలెండర్ త్వరలో రాబోతుందని, జూన్ రెండో తేదీన ప్రభుత్వం తీపికబురు అందించబోతుందన్నారు.
విద్యార్థులు అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉన్నాయని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నిరుద్యోగు లు వెెబ్ సైట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.