17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జూనియర్ కళాశాలలను పగడ్బందీగా నిర్వహించాలి

09-05-2025 01:45 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల, మే 8 (విజయ క్రాంతి): జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం  కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ శాఖ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష  నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్లు, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉతీర్ణత శాతం పెంచాలని అన్నారు. 

గత 10సంవత్సరాలలో ప్రశ్నా పత్రాలలో వచ్చిన ముఖ్యమైన పాఠ్యాంశాలను అభ్యాసన చేయించి సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ వారం రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  అడ్మిషన్స్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి స్టాఫ్, లెక్చరర్ కు కళాశాలలో జరిగే అడ్మిషన్స్ పై లక్ష్యాలను కేటాయించాలని తెలిపారు. కళాశాల సాధించిన మెరుగైన ఫలితాలు, మన దగ్గర ఉన్న నాణ్యమైన లెక్చరర్స్ వసతులను వివరిస్తూ అడ్భిషన్స్ పెంచాలని అన్నారు. 

కళాశాలల అనుమతులు, అఫిలేషన్ రెన్యూవల్ దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమీప రోడ్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.   ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ , జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్ రావు, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి భారతి, విద్యా, ఫైర్ శాఖల అధికారులు, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.