22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

గొప్ప కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి

07-09-2025 10:20 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబుల పరిపాలన అంతం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చిన మహోన్నతమైన కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్(CPI District Secretary Panjala Srinivas) కొనియాడారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి 34 వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలకు ఆకర్షితుడైన రావి నారాయణరెడ్డి స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా అనేక పోరాటాలలో పాల్గొని జీవితం గడిపారని, హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబుల పాలనలో మగ్గుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు ఆంధ్ర మహాసభలో చేరి ప్రజలను చైతన్య పరచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారని, వెట్టి చాకిరి రద్దు కావాలని, బానిసత్వం పోవాలని, ప్రజలను చిత్రహింసలు చేస్తున్న నిజాం రజాకార్ మూకలను ఎదిరించడానికి అనేక గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేశారని, సాయిద రైతాంగ పోరాటం ద్వారానే నిజాం నవాబులు ఎదుర్కోగలమని పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బూడిద సదాశివ,శాఖ కార్యదర్శులు చెంచల  మురళి, గామినేని సత్యం, నగునూరి రమేష్, నాయకుల నల్లగొండ శ్రీనివాస్, నునావత్ శ్రీనివాస్, పి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.