17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కామారెడ్డి జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

05-11-2025 07:10 PM

సామూహిక సత్యనారాయణ వ్రతాలు..

తులసి మొక్కలకు  ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం, సంకష్టహర గణపతి ఆలయం, శ్రీరామ్నగర్ కాలనీ భక్త ఆంజనేయ ఆలయం, సాయిబాబా ఆలయం, రామేశ్వర్ పల్లి శివారులోని సద్గురు సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. గాంధీనగర్ కాలనీలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు.

ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయమే తలంటూ స్నానాలు ఆచరించిన మహిళలు ఇండ్లలోని తులసి మొక్కలకు ఆలయాల వద్ద గల తులసి మొక్కలకు, ప్రత్యేక పూజలు నిర్వహించారు, దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భిక్కనూరు సిద్దరామేశ్వరా లయం ఆలయం, చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయం, రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఈశ్వర ఆలయం, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని శివకేశవ ఆలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు,ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.