15 June, 2026 | 3:27 PM

Breaking News

కిరాతకుడుని ఉరితీయాలి..   •   కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •  

సుగుణ పౌల్ట్రీ ఫారం ఎదుట పలు గ్రామాల ప్రజలు ధర్నా.!

05-11-2025 08:23 PM

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని పోతుల బోగోడ గ్రామంలో సుగుణ పౌల్ట్రీ ఫారమ్ నుండి వెలువడే తీవ్ర దుర్వాసనతో పొతులగుడ గ్రామస్తులు, తీవ్రంగా బాధపడుతున్నారు. సుగుణ ఫారమ్‌ను తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ యూనిట్ వల్ల పర్యావరణ మాటుపడుతోందని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని నిరసనకారులు ఆరోపించారు.

దుర్వాసనతో దినచర్యలు భగ్గమయ్యాయి: ఫారమ్ వల్ల రోజంతా కుళ్ళిన మాంసం, వ్యర్థాల వాసన వ్యాపిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. 

వ్యవసాయానికి హాని: ఫీడ్ ఫ్యాక్టరీ వల్ల నేల, నీటి వనరులు కలుషితమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ చర్య కోసం కోరిక: ఫారమ్‌ను గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలోకి తరలించాలని, లేకుంటే దాన్ని మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.