17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

సీఎం రేవంత్ గూఢచారి ఎవరో చెప్పిన కవిత

27-01-2026 12:15 PM

నిమ్స్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన కవిత

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం పరామర్శించారు. ఎక్సైజ్ పోలీసులంటే గంజాయి ముఠాలకు భయం లేదని కవిత తెలిపారు. ఆబ్కారీ సిబ్బంది వద్ద ఆయుధాలుంటేనే స్మగ్లర్లకు భయం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆబ్కారీ, అటవీ శాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలని కవిత డిమాండ్  చేశారు. రాష్ట్రంలో నేరగాళ్లు విచ్చలవిడితనం పెరిగిపోయిందని కవిత ఆరోపించారు. ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే సంతోష్ రావు అని కవిత విమర్శించారు. సంతోష్ రావు వల్లే గద్దర్ లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గూఢచారి సంతోష్ రావు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గూఢచారి సంతోష్ రావుకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదన్నారు. సిట్ పిలవడం సరేకానీ.. ఏం శిక్షలు పడతాయో చూడాలన్నారు.