16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

దేశ రక్షణకై నేను సైతం తుపాకీ పడతా : ఎమ్మెల్యే బొజ్జు

10-05-2025 03:46 PM

అమర వీర జవాన్ నివాళ్ళు... 

ఆదిలాబాద్,(విజయక్రాంతి): యుద్ధం ఎప్పుడూ వచ్చిన దాన్ని ఢీ కొట్టడానికి దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా యువత ముందు వరుసలో ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bhojju Patel) పిలుపు నిచ్చారు. శనివారం ఉట్నూర్ లో వేడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రముఖలతో వీరోచితంగా పోరాడి అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం 2నిమిషాల మౌనం పాటించారు. అనంతరం మాజీ జవాన్ లు డాకురే శత్రుఘన్, నరోటె వినాయక్ లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్ధమే వస్తే నేను సైతం తుపాకీ పట్టి రణరంగంలో ఉండి పోరాడుతానని స్పష్టం చేశారు. దేశం కోసం అమరుడైన జవాన్ మురళి నాయక్ త్యాగం వృధా పోదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వెడ్మ ఫౌండేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, యువతి, యువకులు పాల్గొన్నారు.