07-06-2025 12:00:00 AM
చింతలమానేపల్లి, జూన్ 6(విజయక్రాంతి) : పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు.
పోడు భూములలో వ్యవసాయ పనులను ఆటవిశాఖ అధికారులు అడ్డుకోవడంతో దిందా గ్రామంలో రైతులు చేపడుతున్న నిరసనకు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వేదిస్తున్నారంటూ ఆరోపించారు.
చాతల కాలం నుండి భూములను నమ్ముకుని జీవిస్తున్న పేద రైతుల ను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఆయన వెంట నాయకులు వెంకన్న, నజిం, రాజన్న, శ్రీను, బొర్కుటి సోమయ్య, డొకె నారాయణ పాల్గొన్నారు.