07-06-2025 12:00:00 AM
-ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ చిత్తరంజన్ తో కలిసి పోలీస్ అధికారులతో సమీక్షించారు.
ఎస్పీ మాట్లాడుతూ శాంతి పరిరక్షణ, నేరాల నియంత్రణల కట్టడి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై మాట్లాడారు. విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రామానుజం, ఎస్పీ, సీఐ రాణాప్రతాప్ జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.