06-06-2025 11:31:47 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల ట్రాలీ ఆటోలకు, ప్యాసింజర్ ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కాన్ స్టిక్కర్స్ ను శుక్రవారం దోమకొండ ఎస్సై స్రవంతి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఐ స్రవంతి మాట్లాడుతూ.. ఆటోలో సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, పరిమితికి మించి ఆటోలు నడపవద్దని అందరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ కు సహకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.