ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు
17-11-2025 07:48 PM
చిన్నచింతకుంట: జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర అమావాస్య వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.




