17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పొగమంచులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

17-11-2025 07:48 PM

వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు

వెంకటాపూర్/రామప్ప (విజయక్రాంతి): మండలంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగి ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోవడంతో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు సూచించారు. వాహనదారులు ఎవ్వరూ రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయకూడదని, వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా పార్కింగ్ లైట్లు ఆన్ చేసి ఉండాలని, పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం మానుకోవాలని, అదేవిధంగా ఉదయం రామప్ప దేవాలయానికి భక్తులు వేకువజామునే చేరుకునే అవకాశం ఉన్నందున వారు కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుని, నిదానంగా ప్రయాణించి, ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, భద్రతా నియమాలను పాటించి, సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.