14 June, 2026 | 4:35 PM

Breaking News

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి   •   ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం   •   ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •  

పాండవలంకలో ఘనంగా లక్ష్మీ అమ్మవారి పట్నాలు

16-05-2025 09:49 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని పాండవలంకలో భక్తులు లక్ష్మీ అమ్మవారి పట్నాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ధర్మారం, ఖానాపూర్ పలు గ్రామాల నుండి  పాండవ బలగం భక్తులు పెద్ద సంఖ్యలో  కాలినడకన లక్ష్మీ అమ్మవారికి పుట్టినిల్లు అయిన పాండవ లొంకకు చేరుకొని    అమ్మవారి ప్రతిమలను కోనేరులో స్నానమాచరించి, పట్నం వేసి, బోనం వండి, లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాండవ బలగం భక్తులు.

అంతకుముందు డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి విగ్రహాలను నెత్తిన పెట్టుకొని, శివసత్తుల పూనకాల మధ్య నృత్యాలు చేస్తూ తమ పాడి, పంట గ్రామ ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శివసత్తులు అమ్మవారి రూపంలో పూనకంతో నృత్యాలు చేశారు. అయితే పాండవులంకకు సరైన మార్గం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రభుత్వం పాండవులంకకు రోడ్డు మార్గాన్ని కల్పించాలని, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.  ప్రతి శ్రావణ మాసంలో పాండవులంకను సందర్శించి, లక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడమే కాకుండా, ఇక్కడి వాటర్ ఫాల్స్ ను  తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు, పాండవలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని పాండవ బలగం భక్తులతో పాటు స్థానికులు కోరుతున్నారు.